News

సియం కేసీఆర్ వైఖరి మార్చుకో : ఎల్ రమణ


ఇప్పటికైనా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన వైఖరిని మార్చుకోవాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ అన్నారు. కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఈ ఏడాది కాలంగా సాగించిన పాలన అంతా కక్షలూ కార్పణ్యాలతోనే సాగిందన్నారు. శనివారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగరరావు పుస్తకావిష్కరణ సభలో సాక్షాత్తూ దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేసిన వ్యాఖ్యలే కేసీఆర్ ఏడాది పాలన తీరుకు నిదర్శనమని ఆయన అన్నారు. హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్నా, తెలంగాణకు పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలి రావాలన్నా ముందుగా ప్రభుత్వ తీరు మారాల్సిన అవసరం ఉందని రమణ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విపక్షం లేకుండా చేయాలన్న ఆలోచనతో సాగుతున్న పాలనకు ఇప్పటికైనా ముగింపు పలకాలని రమణ హితవు పలికారు